స్వయంగా పెన్షన్ అందజేసిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పెనుమాక ఎస్టీ కాలనీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు అక్కడ లబ్దిదారు పాముల నాయక్‌కి వృద్ధాప్య పెన్షన్ అందజేశారు. అలాగే నాయక్ భార్యకు సీడీఆర్ఏ పెన్షన్, కుమార్తెకి వితంతు పెన్షన్ అందించారు. వాళ్లు ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న పూరింట్లో నివాసం వుంటున్న పాముల నాయక్ తనకు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. పరిశీలిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా లబ్దిదారు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించడం ఇదే ప్రథమం.