చంద్రబాబు దీక్షకు భారీ ఏర్పాట్లు...
posted on Apr 19, 2018 12:13PM
ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా భాగంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టనున్న నిరాహారదీక్షకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. దీనిలో భాగంగానే దీక్షాస్థలికి వచ్చే టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికీ వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం మొత్తాన్ని తెల్లటి గుడ్డతో టెంట్ లాగా చేశారు. దాదాపు 250 మంది నేతలు కూర్చునేలా భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఈ దీక్షకు 'ధర్మ పోరాట దీక్ష' అనే పేరును పెట్టారు.