పిల్లలకు ఆస్తులు కాదు.. సంస్కారాన్ని పంచండి

పిల్లలకు ఎన్ని ఆస్తులు, ఎంత భూమి ఇచ్చామనేది కాదని.. ఎంత సంస్కారాన్ని నేర్పించామనేది ముఖ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. అబ్దుల్ కలాం పుట్టినరోజున ప్రతిభా అవార్డు పురస్కారాలు ఇవ్వడం సబబుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పారు. చదువు.. తెలివినిస్తుంది.. ఏదైనాసరే, సాధించే శక్తినిస్తుంది. అదే సమయంలో, సంస్కారం భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలి.. పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడుతున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu