నేను వదులుకోవడానికైనా సిద్దమే.. చంద్రబాబు

సోమవారం తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా చంద్రబాబు శాసనమండలిలో బాహాటంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో నేతలపై ఆయన ఎంత అసంతృప్తి, కోపంగా ఉన్నారో ఇట్టే అర్ధమవుతోంది. అదేంటంటే ఈ మధ్యకాలంలో అధికార పక్ష నేతలు పలు వివాదస్పద చర్యల్లో ఇరుక్కున్నారన్న విషయం తెలసిందే. అది ఇసుక వ్యవహారంలో కావొచ్చు.. అధికారుల బదిలీల విషయంలోనూ.. తాజా కాల్ మనీ ఇష్యూలోనూ.. విపక్ష నేతలతో చెట్టాపట్టాలు వేసుకున్న తీరు ఏదైనా కావచ్చు.. ఇలా పలు విషయాల్లో వివాదాస్పదంగా మారారు. అయితే ఒకప్పుడు తమ నేతలు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండే చంద్రబాబు ఇప్పుడు మాత్రం వారిని ఉపేక్షించే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. దీనికి ఆయన నిన్న జరిగిన శాసనమండలి సమావేశంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. కొందరికి తెలివి ఎక్కువై.. వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారని.. అలాంటి అసాంఘికశక్తుల్ని అణచివేసి.. శాంతియుత వాతావరణాన్నికల్పిస్తామని చెప్పిన చంద్రబాబు ఇందుకు అవసరమైతే.. ఒకరిద్దరిని వదులుకోవటానికైనా తాను సిద్ధమేనని తేల్చి చెప్పారు. మరి చంద్రబాబు ఇచ్చిన వార్నింగుకు భయపడైనా తెలుగు తమ్ముళ్లు ఎంత జాగ్రత్తగా ఉంటారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu