పోలవరం.. కేంద్రం 12 వేల కోట్ల వరం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం కీలకమైన ముందడుగు వేసింది. పోలవరం మొదటిదశ నిర్మాణానికి 12 వేల కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత నిధులు విడుదలవుతాయి. పోలవరం ప్రాజెక్టు అంశం మీద విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని పార్లమెంట్‌లో కీలకమైన ప్రసంగం చేసిన కొద్ది సేపటికే 12 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.