తెలంగాణలో సెల్ ఫోన్ల వినియోగం ఎక్కువే 

మత్తు పదార్థాల వలె సెల్ ఫోన్లకు అతుక్కుపోయేవారి సంఖ్య  రోజురోజుకి పెరిగిపోతుంది. ట్రాయ్ 2024  సెప్టెంబర్ నివేదిక ప్రకారం తెలంగాణలో 4.19 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడైంది.  ఇందులో సెల్ ఫోన్ లు వినియోగించేవారు 4.4 కోట్లు ఉంటే ల్యాండ్ లైన్ వినియోగించేవారు 15.25  లక్షల వరకు ఉన్నారు. సెల్ ఫోన్ లు వినియోగించే వారు పట్టణాల్లో 59 శాతం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 39 శాతం ఉన్నారు. ల్యాండ్ లైన్ వినియోగించే వారు పట్టణాల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు వెల్లడైంది.  ప్రతీ వందమందిలో 105  సెల్ ఫోన్లు ఉంటున్నాయి. అంటే జనాభా కంటే సెల్ ఫోన్లు ఎక్కువగా ఉంటున్నాయి. సెల్ ఫోన్లు వినియోగించడం వల్ల మెదడు సంబంధిత రుగ్మతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.