జగన్ కు షాక్... టీడీపీ తీర్ధం పుచ్చుకున్న బుట్ట రేణుకా


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ తగలనే తగిలింది. బుట్ట రేణుకా వైసీపీ పార్టీ వీడుతుందని.. టీడీపీ తీర్థం పుచ్చుకోనుందని అలా వార్తలు వచ్చాయో.. లేదో అప్పుడే ఆ వార్తలు నిజమయ్యాయి. ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. అమరావతి, ఉండవల్లిలోని తన నివాసంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా పచ్చ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికారు. బుట్టా రేణుకతో పాటు వైసీపీ నేత, సెంట్రల్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి ప్రకాశ్ రెడ్డి కూడా అధికార తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కర్నూలు అభివృద్ధికి తాను కట్టుబడి వున్నానని తెలిపారు. కాగా, రేణుక భర్త బుట్టా నీలకంఠ గతంలోనే టీడీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే.