పుల్వామా జిల్లాలో ఎదురుకాల్పులు..

 

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో.. బట్నూర్ లస్సీపోరా గ్రామ సమీపంలో భద్రతా దళాలకు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు గాయపడగా.. మరో నలుగురు పరారయ్యారు.  గాయపడ్డ టెర్రరిస్టులకు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. పారిపోయిన వారికోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu