పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ ను కూల్చేయండి...!

 

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత అజాంఖాన్ మరోసారి పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌మ రాష్ట్ర‌ పర్యాటక గైడులో నుంచి తాజ్‌మహల్‌ను తొలగించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ యూపీ శాసనసభ్యుడు సంగీత్‌ సోమ్ కూడా తాజ్‌మహల్‌ చరిత్రపై విమ‌ర్శ‌లు చేశారు. ఇక దీనిపై స్పందించిన అజంఖాన్.. అప్ప‌టి కాలంలో దేశాన్ని పాలించిన వారిని గుర్తు చేసే చారిత్రాత్మక కట్టడాలను ధ్వంసం చేయాలని వ్యాఖ్యానించారు. అందులో భాగంగా పార్లమెంట్‌తో పాటు కుతుబ్‌ మినార్‌, రాష్ట్రపతి భవన్‌, తాజ్‌మహల్ లాంటి క‌ట్ట‌డాల‌న్నింటినీ ధ్వంసం చేయాల‌ని పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్‌, రాష్ట్రపతి భవనాలు కూడా బానిసత్వానికి ప్రతీకలుగా ఉన్నాయని అజాంఖాన్ చెప్పుకొచ్చారు.