విశాల్ తో వస్తున్న అర్జున్ కూతురు
posted on Mar 10, 2014 2:56PM

యాక్షన్ కింగ్ అర్జున్ అంటే తెలియని వారుండరు. "జెంటిల్ మెన్", "ఒకే ఒక్కడు" వంటి చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించి, తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అయితే ప్రస్తుతం అర్జున్ కుమార్తె టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా "ధీరుడు" సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భూపతి పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విశాల్ సరసన ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్, ప్రేమ, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను "విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ" బ్యానర్లో విశాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ అందిస్తున్న ఈ పాటలను జూన్ 25న విడుదల చేయనున్నారు. జూలై మూడో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.