ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సామాన్య ప్రజల నుండి అటు విఐపిల వరకు ప్రస్తుతం అందరిని కరోనా చుట్టేస్తోంది. ఈ రోజు ఉదయం ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో క్యాబినెట్ లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనను హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం వైసిపి నేతలు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు లు కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu