తెరాస మరో భారీ బహిరంగ సభ..!!

 

తెరాస రీసెంట్ గా 'ప్రగతి నివేదన' పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ఈ సభకు కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేసారు.. ఈ ఉత్సాహం నుండి ఇంకా బయటికి రాకముందే తెరాస మరో భారీ సభకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.. సెప్టెంబర్‌ 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారట.. ఇప్పటికే దీని గురించి మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం.. అదేవిధంగా ఈ సభలో ముందస్తు గురించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇక ఈ సభలో కేసీఆర్ స్పీచ్ ఎప్పటిలాగే అదరగొట్టబోతున్నారట.. కేసీఆర్ కు మొదటి నుండి స్పీచ్ అదరగొడతారనే పేరుంది.. కానీ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ఎందుకో కాస్త డల్ అయ్యారనే మాటలు వినిపించాయి.. ఈ నేపథ్యంలో హుస్నాబాద్‌లో జరిగే సభలో కేసీఆర్ స్పీచ్ అదరగొట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.