పంజాగుట్ట పిఎస్ లో యాంకర్ విష్ణుప్రియ

 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కేసులో టీవీ  యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన న్యాయవాది తో కలిసి ఉదయం పది గంటలకు  పిఎస్ కు చేరుకున్నారు  మంగళవారం సాయంత్రం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ ఆమె హాజరు కాలేదు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారన్న భయంతో విచారణకు హాజరు కాలేదని విష్ణు ప్రియ చెబుతున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో తన కో ఆర్టిస్ట్ షేకర్ భాషా పంజాగుట్ట పిఎస్ కు వచ్చి ఇదే విషయాన్ని చెప్పారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరుకానున్న నిందితుల్లో 11 మంది ఉన్నప్పటికీ విచారణకు హాజరైన వారిలో విష్ణు ప్రియ మొదటి స్థానంలో నిలిచింది.  షూటింగ్ కారణంగా విష్ణుప్రియ మంగళవారం  గైర్హాజరైనట్లు ఇవ్వాళ పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారు. తన తరఫున శేఖర్ భాషాను పోలీస్ స్టేషన్ కు పంపించినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ల కారణంగా చాలామంది సుసైడ్ చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనికి తోడు ఐపిఎస్ అధికారి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు.   ఈ యాప్స్ కు సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ చేయడంపై ఆయన  సోషల్ మీడియా వేదిక ద్వారా యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. సజ్జనార్ ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. తాజాగా ఇందులో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు.