ఆ రహస్య భేటీకి చంద్రబాబే సూత్రధారి!!

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ముగ్గురు కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడిందని విమర్శించారు. తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డను తక్షణమే అరెస్ట్ చేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ఈ రహస్య భేటీకి చంద్రబాబే సూత్రధారని.. చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురి రహస్య భేటీపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ బండారం బయట పెట్టేందుకు ఎంత దూరమైన వెళ్తామని అంబటి రాంబాబు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu