మహారాష్ట్ర మహిళల్లో 52౦౦౦ మందిలో క్యాన్సర్ !

మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ మాతా సురక్షిత్ తార్ ఘర్ సురక్షిత్ కార్యక్రమం లో భాగంగా గత రెండు నెలలుగా మహారాష్ట్ర గ్రామీణ పట్టణ ప్రాంతాలాలో ఆరోగ్యకేంద్రాలలో 18 సం వత్చారాలు పై బడిన మహిళల లో శారీరక మానసిక పరిస్థితుల ను తెలియచేస్తుంది 4,౦1,86,717 మంది మహిళలకు స్క్రీనింగ్ నిర్వహించారు ఇందులో ౩౦ సం వత్సరాలు పై బడిన 1.5 మంది స్త్రీలలో 52,568 మందిని నట్లు వారికి వక్షోజాల్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

కాగా మరికొంత మందికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని వారిలో ఏ ఏ క్యాన్సర్ లు ఉన్నాయో ఈ స్థాయిలో గుర్తించడం అవసరం అని ఈ రోగులకు రాష్ట్ర ప్రభుయ్హ్వం అవసరమైన చికిత్చకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.స్క్రీనింగ్  సమయంలో వచ్చిన రేపోర్ట్ ఆధారంగా మరికొంత మందిలో నోటి క్యాన్సర్ ఊపిరి తిత్తుల క్యాన్సర్ ప్రాధమిక స్థాయిలో ఉన్నట్లు వాటికి సరైన చికిత్చ చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. 

ఈ కార్యక్రమం లో స్వచ్చంద సంస్థలు క్యాన్సర్ ఆసుపత్రులు చికిత్చలో పాల్గొనాలని ఇందులో మహిళలు తల్లులు వారి  బి ఎం ఐ ఆదారంగా రక్తం,మూత్ర పరీక్షలు ,డయాబెటిస్,హిమాగ్లోబిన్ శాతం ఎంత ఉందొ పరీక్షిస్తున్నారని ఈ నెల చివరి నాటికి ముగుస్తుందని ఆరోగ్యశాఖ అధికారి అనిరుద్ధ దేశ్ పాండే వెల్లడించారు.వీరిలో చాలా మందికి క్యాన్సర్ తో పాటు ఇతర నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్ కూడా ఉంది ఉండవచ్చని క్యాన్సర్ సమస్యలు కూడా ఉన్నాయని చాలాకేసులను ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్చ సాధ్యమని అన్నారు.

కొందరిలో నాన్ కమ్యునికేబుల్ వ్యాధులు ఉన్నా లక్ష్సణాలు లేవని అయితే వారు ఆరోగ్యంగా ఉన్నారని వారి పై వ్యాధి వారి శరీరం పై చాలా ఆలస్యంగా ప్రభావం చూపుతుందని రోగులకు మరిన్ని పరీక్షలు చేయడం ద్వారా అవసరమైన చికిత్చ,లేదా శాస్త్ర చికిత్చ కు కూడా వెనుకడ బోనని అధికారులు వెల్లడించారు.