చీపురు పట్టిన కేంద్రమంత్రి.. ఆసుపత్రి వార్డులు శుభ్రం..

 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్వయంగా చీపురు పట్టి శ్రమదానం చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో శ్రమదానం పేరిట ఆసుపత్రి వార్డులను శుభ్రం చేశారు. జేపీ నడ్డా 'కాయకల్ప' కార్యక్రమం పేరిట ఇటీవల పచ్చదనం-పరిశుభ్రత డ్రైవ్ ను ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఆయన నిన్న ఎయిమ్స్ వచ్చి తనిఖీలు నిర్వహించి..తానే స్వయంగా ఆసుపత్రి వార్డులను శుభ్రం చేశారు. అనంతరం ఎయిమ్స్‌ సిబ్బందితో సదుపాయాలపై చర్చించారు. ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచాలని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని నడ్డా స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu