ఒకేసారి చచ్చిపోతాం...

 

పోలీసుల వేధింపులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే అందరం సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని దాదాపు 50 మంది మహిళలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బెదిరింపులకు దిగిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది. పొలాచి సమీపంలోని అంగలకురిచి ప్రాంతంలో నివసించే 25 కుటుంబాలకు చెందిన దళిత మహిళలు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులు తమ ప్రాంతానికి వచ్చి, తమ కులానికి చెందిన వారిని వేధిస్తున్నారని, ఇప్పటికైనా తమ మీద వేధింపులు ఆపకపోతే అందరం కలసి కలెక్టరేట్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని ఆ మహిళలు బెదిరించారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu