ఆలయ ఈవోపై పెట్రోల్ దాడి..

 

ఓ ఆలయ ఈవో పై పెట్రోల్ దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూల్ జిల్లాలోని యాగంటి ఆలయ ఈవో ఆదిశేషునాయుడుపై దాడి చేసి పెట్రోల్ పోసి అంటించి హతమార్చేందుకు విఫలయత్నం జరిగింది. ఈ దాడికి పాల్పడింది జూనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి. వివరాల ప్రకారం.. కృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో ఈవో ఆయన జీతాన్ని నిలిపివేశారు. ఆ కోపంతో కృష్ణారెడ్డి.. ఆదిశేషునాయుడుపై పెట్రోల్ పోసి దాడి చేశారు. దీంతో వెంటనే సిబ్బంది తేరుకొని ఆయన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన నేపథ్యంలో ఆదిశేషునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu