రెండు రైళ్ళు ఢీ: ప్రయాణికుల టైమ్ బాగుంది!

 

ఫ్రాన్స్లో ఒకదానికి ఎదురుగా మరొకటి వచ్చిన రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ప్రయాణికుల అదృష్టం బాగుండి ఆ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. 20 మంది ప్రయాణికులు మాత్రమే గాయపడ్డారు. పావు బేయాన్ లైన్లో 178 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు ట్రాక్పై 70 ప్రయాణికులతో ఆగి ఉన్న టీఈఆర్ ట్రైన్ను ఢీ కొట్టింది. దాంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఢీకొన్న సమయంలో రెండు రైళ్ళ వేగం చాలా తక్కువగా వున్నందువల్లే జననష్టం జరగకుండా వుందని అధికారులు చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu