రాశుల  ఆధారంగా మహాశివరాత్రి అభిషేకం.. ఇలా చేస్తే గ్రహ దోషాలు మాయం..!

మహా శివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 15వ తేదీన వచ్చింది.  భారతదేశం యావత్తు మహా శివరాత్రిని ఎంతో వైభవంగా జరుపుకుంటుంది.  ఉపవాసాలు, జాగరణలు, అభిషేకాలు దేశంలోని అన్ని శివాలయాలలో జరుగుతాయి. మహా శివరాత్రి రోజు పూజ,  అభిషేకం, ఉపవాసం.. వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.  అయితే మహా శివరాత్రి రోజు రాశుల ఆధారంగా శివలింగ అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతారు.  12రాశులలో ఏ రాశి వారు శివలింగానికి ఏ అభిషేకం చేస్తే మంచిది? దాని వల్ల కలిగే మార్పు ఏమిటి? తెలుసుకుంటే..


మేష రాశి..

బెల్లం లేదా తేనె కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి.  "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

వృషభం..

ఆవు పాలు,  పెరుగుతో శివునికి అభిషేకం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సదాశివ అనే మంత్రాన్ని జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

మిథునం..

మిథున రాశి వారు శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చేయాలి. ఇది జాతకంలో గ్రహ దోషాలను తగ్గిస్తుంది.  జీవితంలో ఆనందం,  శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు.

కర్కాటక రాశి..

108 అక్షత బియ్యాన్ని నీటిలో వేసి "ఓం నమః శివాయ" అని జపిస్తూ శివలింగంపై వేయాలి.  

సింహరాశి..

తేనెతో అభిషేకం చేసి, శివుడికి ఎర్ర చందన తిలకం పెట్టాలి. రుద్రాష్టకం పఠిస్తే చాలా మంచిది.  

కన్య..

గంజాయి కలిపిన నీటితో అభిషేకం చేసి, శివ చాలీసా పఠించడం లేదా శివ సహస్ర నామాలు వంటి శివుడి శ్లోకాలు పఠించాలి. ఇది రక్షణను ఇస్తుంది. గ్రహ దోషాలు తొలగిస్తుంది.

తులారాశి..

నెయ్యితో శివ లింగానికి  అభ్యంగన స్నానం చేయించాలి.  ఈ పరిహారం పిల్లల ఆనందం, ఆర్థిక లాభం,  మంచి ఆరోగ్యానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది.

వృశ్చికం..

గంగా జలంతో గులాబీ నీటిని కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇది వైవాహిక జీవితంలో ఆనందం,  శాంతిని తెస్తుంది.

ధనుస్సు..

శివ లింగానికి నీరు సమర్పించిన తర్వాత  పసుపు ఆవాలును సమర్పించాలి. ఇది అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు.
 
మకరం..

నల్ల నువ్వులు నింపిన నీటితో అభిషేకం చేసి, బిల్వ ఆకులను సమర్పించాలి. ఇది శనికి సంబంధించిన శుభ ఫలితాలను తెస్తుంది.

కుంభం..

ఆవ నూనె లేదా పంచామృతంతో అభిషేకం చేయడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ పరిహారం భయం, వ్యాధి,  శత్రు అడ్డంకుల నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు.

మీనం..

నెయ్యి,  గంగా జలంతో అభిషేకం చేయాలి. అలాగే, "ఓం నమః శివాయ" అని చెబుతూ 108 అక్షంత గింజలను సమర్పించి, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.

                               *రూపశ్రీ.


More Maha Shivaratri