వైసీపీలో అసమ్మతి సెగ.. వంగవీటి రాధా అలక!

 

విజయవాడ వైసీపీలో అసమ్మతి సెగలు మొదలవుతున్నాయి.. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధా ఆశలపై నీళ్లు చల్లి.. మల్లాది విష్ణుకు సెంట్రల్‌ పగ్గాలు అప్పగించేందుకు అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఆదివారం వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది.. ఈ సమావేశంలో రాధాను సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై కాకుండా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం.. ఈ నిర్ణయాన్ని రాధా వ్యతిరేకించి, సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.. మరి విజయవాడ వైసీపీ రాజకీయం ఎటు వైపు వెళ్తుందో చూడాలి.