కోదండరాం ఆగ్రహం..కాంగ్రెస్ కు అల్టిమేటం

 

తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది.ఓ పక్క ప్రచారాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.తెరాసను గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో తెదేపా, సీపీఐ, తెజసలతో తెలంగాణలో మహాకూటమి ఏర్పాటైన విషయం తెలిసిందే. కానీ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు మాత్రం ఓ కొలిక్కి రాలేదు.నిన్న సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించాల్సిన పార్టీలు చివరి నిమిషంలో సమావేవేశాన్ని వాయిదా వేసుకున్నాయి.దీంతో సీట్ల కేటాయింపు, పొత్తుల అంశంపై స్పష్టత ఇవ్వని కాంగ్రెస్‌పై తెజస కోదండరాం ఆగ్రహం వ్యక్తంచేశారు.త్వరగా పొత్తులు, సీట్ల సర్దుబాటుపై తేల్చాలంటూ ఆయన మహాకూటమిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌కు లేఖ రాశారు.48గంటల్లోగా సీట్ల కేటాయింపు అంశాన్ని తేల్చాలని.. లేకపోతే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించినట్టు సమాచారం. తాము కోరుకున్న సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే కలిసొచ్చే పక్షాలతో ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది మరో రెండు రోజుల్లో 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కూడా ప్రకటించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో తెజస కార్యాలయంలో కోదండరాంతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ భేటీ అయ్యారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు.మరి కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు అంశంపై తొందరపడకుంటే పొత్తు పటాపంచల్ అవ్వటం కాయమని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.