కొత్త జిల్లాలపై కాంగ్రెస్ నేతల దీక్ష..

 

తెలంగాణ రాష్ట్రం కొత్తగా మరో 17 జిల్లాలను ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుటికే వాటికి సంబంధించిన ఫొటోలు, మ్యాప్ లపై అధికారులు కసరత్తు చేసి పదిహేడు జిల్లాలతో కూడిన పటాన్ని విడుదల చేశారు. అయితే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు నిరహార దీక్ష చేపట్టారు. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, ఇతర నేతలు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరుగుతోందంటూ జిల్లా పునర్‌వ్యవస్థీకరణ ప్రజాభీష్టం మేరకు కాకుండా.. స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో చేస్తున్నారని ఆరోపించారు. జనగామ, గద్వాల జిల్లాలు ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. రెండురోజుల పాటు దీక్ష చేస్తామని చెప్పారు.