ప్రజల కోసం ప్రాణాలైన ఇస్తానంటూ కన్నీరు పెట్టుకున్న రాజయ్య

 

మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కంట తడి పెట్టారు. జనగామ జిల్లా, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన ఇద్దరు కుమారుల వివాహ మహోత్సవం వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గం లోని ప్రజాప్రతినిధులు, అధికారులు, బంధువులు పాల్గొని రెండు జంటలను ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ఎన్నో అవమానాలకు గురై.. నింధలు మోసి కూడా.. ఎన్నోసార్లు విజయం సాధించానన్నారు. నన్ను నమ్ముకొని నా వెంట ఉన్న వారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానంటూ.. ఎమ్మెల్యే రాజయ్య కంట తడి పెట్టారు. నియోజకవర్గ ప్రజలను తన కుటుంబ సభ్యుల్లాగా  చూస్తానని అన్నారు. భాగోద్వేగాలు ఎవరికైనా ఒకటే.. కొన్ని సందర్భాల్లో కొన్ని జ్ఞాపకాలను కదిలించినప్పుడు ఎంతటి వారైనా కంట తడి పెట్టాల్సిందేనని ఈ దృశ్యం చూసినప్పుడు అనిపిస్తుంది. మొత్తానికి ఆయన అలా కంట తడి పెట్టడం ఎందరినో కదిలించేసింది.