ఆ దెబ్బతో అన్నీ మూసుకుని సెక్రటేరియట్ లో కూర్చున్న బొత్స: టీడీపీ నేత ఫైర్

 

 

ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడి 100  రోజులు పూర్తైన సందర్బంగా ఒక పక్క వైసిపి నాయకులు తాము ఈ వంద రోజులలో చేపట్టిన కార్యక్రమాల   గురించి ఘనంగా చెప్పుకుంటుంటే మరో పక్క టీడీపీ నేతలు మాత్రం ఈ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా మీడియా తో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వైసిపి తన 100 రోజుల పాలనలో టీడీపీ అవినీతిని నిరూపించలేక పోయిందని విమర్శించారు. ఈ వంద రోజులలో కేవలం సుజనా చౌదరి పూర్వీకుల భూములు, ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కు రాష్ట్ర  ప్రభుత్వం ఇంకా హ్యాండోవర్ చేయని భూములను చూపిస్తూ ఇదే అమరావతిలో టీడీపీ అవినీతి అన్నారని ఐతే సుజనా, భరత్ ఛాలెంజ్ కు మాత్రం బొత్స జవాబివ్వలేదని రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ఈ సందర్బంగా అయన రాజధానికి చెందిన మహిళ మంత్రి బొత్సను వరద విషయంలో సవాలు చేసిన విషయం ప్రస్తావిస్తూ 2009  లో కానీ 2019 లో కానీ అమరావతి ప్రాంతం ముంపుకు గురైందని నిరూపిస్తే టెన్ పుట్టినింట వారు ఇచ్చిన మూడెకరాల భూమిని బొత్సకు ఫ్రీగా రాసిస్తానని ఛాలెంజ్ చేస్తే బొత్స గారి దగ్గర సౌండ్ లేదని,  అన్నీ మూసుకుని సెక్రటేరియట్ లో కూర్చున్నారని బొత్స పై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.