సంజయ్ దత్ కు ఐదేళ్ళ జైలుశిక్ష ఖరారు

1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబుపేలుళ్ళ కేసులో సినీనటుడు సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు ఐదేళ్ళు జైలుశిక్ష విధించింది. ఆరేళ్ళ నుండి ఐదేళ్ళకు శిక్షను ఖరారు చేసింది. మరొక నిందుతుడు యాకుబ్ మెమెన్ కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగతా పదిమందికి మరణశిక్షను జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ కోర్టు లాబీలు కూర్చుని వుండగా ఈ తీర్పు వెలువడింది. ఇరవై సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు ఎట్టకేలకు ఈ రోజు తీర్పు వెలువరించింది.