దారుణం... 13 ఏళ్ల బాలికపై 8 మంది టీచర్లు అత్యాచారం...

 

రాజస్థాన్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది టీచర్లు.. 13 ఏళ్ల బాలికపై.. 18 నెలలపాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం..రాజస్థాన్ లోని బికనీర్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న 13 ఏళ్ల బాలికపై 18 నెలలపాటు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన కలకలం రేపింది. అయితే అప్పుడు చేసిన ఆ ఘనకార్యానికి సంబంధించిన వీడియోలు తీసిన ఆ దుండగులు ఇప్పుడామెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధిత బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేన్సర్ తరహా వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెపై అఘాయిత్యం చేయడమే కాకుండా ఆమె గర్భందాల్చకుండా మాత్రలు కూడా ఇచ్చారని ఆయన కుమిలిపోయారు. దీనిపై మహిళా కమిటీ వేసిన ప్రభుత్వం విచారణ జరుపుతోంది.