మోడీ అది కూడా మాయం చేయగలడు...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత కొద్దికాలంగా ప్రధాని మోడీపై సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఇప్పుడు మరోసారి మోడీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవినీతిని అంతం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ... ఆ పని చేయకపోగా, కుంభకోణాలకు పాల్పడిన వారిని మాత్రం దేశం నుంచి మాయం చేస్తున్నారని, భారత చట్టాలు చేరుకోలేని దేశాలకు వారిని తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాదు... మోదీ గొప్ప ఇంద్రజాలికుడని, త్వరలోనే దేశం నుంచి ప్రజాస్వామ్యాన్ని కూడా ఆయన మాయం చేస్తారని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజలకు జీవితంపై భరోసా కల్పించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు.