యాత్రకు బయలుదేరిన జనసేనాని
posted on Jan 22, 2018 11:17AM
సినీనటుడు, జనసేన అధినేత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మూడు రోజుల యాత్ర కోసం జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయలుదేరారు. జనసేన కార్యాలయంలో ఆయన భార్య అన్నాలెజ్నోవా ఎదురురాగా.. అభిమానుల కేరింతల మధ్య యాత్రకు బయలుదేరార్ పవన్. రూఫ్టాప్పై నిలబడి, భారీ ఎత్తున తనను ఆశీర్వదించేందుకు.. అండగా నిలిచేందుకు విచ్చేసిన అభిమానులకు, కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. అనంతరం అభిమానులంతా సీఎం.. సీఎం అని నినాదాలు చేశారు. యాత్ర గురించి ఏమైనా చెబుతారని మీడియా జనాలు ఆశించినప్పటికీ.. ఇప్పుడేం చెప్పను కొండగట్టుకు వెళ్లిన తర్వాతే మొత్తం అన్నింటి గురించి చెబుతానని పవన్ జవాబిచ్చారు. కొండగట్టులో ఆంజనేయుని దర్శనం అనంతరం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. సుమారు 30 కార్ల కాన్వాయ్తో పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు.