కేరళకు 500 కోట్లు సాయం ప్రకటించిన మోదీ
posted on Aug 18, 2018 11:41AM
కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది.. ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు.. ఇప్పటికే సినీపరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు పలువురు విరాళాలు అందించారు.. అలాగే తెలంగాణ ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి 25 కోట్ల సాయం ప్రకటించింది.. తాజాగా ప్రధాని మోదీ కేరళ వరద పరిస్థితిపై సమీక్షించి, ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తో కొచ్చిలో సమావేశమయ్యారు.. కేరళకు తక్షణ సాయంగా 500 కోట్ల రూపాయిలను మోదీ ప్రకటించారు.. దీనిలో భాగంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయిలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయిలు చొప్పున పరిహారం అందిస్తామని మోదీ తెలిపారు.