జియోకు జనం బాగా అలవాటు పడ్డారు

జియోకు జనం బాగా అలవాటు పడ్డారన్నారు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ. జియో కస్టమర్ల సంఖ్య పది కోట్లకు చేరిన సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. జియో నెట్‌వర్క్‌లో ప్రతిరోజూ 5.5 కోట్ల గంటల వీడియోను చూస్తున్నట్లు అంబానీ వెల్లడించారు. ఒక్క జనవరి నెలలోనే వందకోట్ల జీబీ డేటాను వినియోగదారులు వాడినట్లు ముఖేష్ తెలిపారు. ప్రస్తుతం మొబైల్ డేటా వాడకంలో ప్రపంచంలోనే మనదేశం తొలిస్థానంలో ఉందని చెప్పారు. గత 170 రోజులుగా సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో ఫ్యామిలీలో చేరుతున్నారని అందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా కొత్త ఆఫర్లను అంబానీ ప్రకటించారు.

* రూ.99 కే జియో ప్రైమ్ మెంబర్‌షిప్..మార్చి 1 నుంచి ఈ సౌకర్యం ప్రారంభం
* రూ.99 కే ఏడాది సభ్యత్వం
* ఏప్రిల్ 1 నుంచి చార్జీలు వసూలు చేస్తాం
* రోమింగ్ చార్జీలు ఉండవు