కెప్టెన్సీ చేసిన ధోని... మర్చిపోయాడా..!
posted on Jan 16, 2017 12:16PM
నిన్న టీమిండియా-ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈమ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే ధోనీనే కెప్టెన్సీ స్థానంలో రివ్యూ అడగడం. అసలు సంగతేంటంటే.. నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్యాచ్ను ధోని అందుకున్నాడు. అయితే అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో ధోనీ వెంటనే రీవ్యూ కోరాడు. కెప్టెన్ కోహ్లి ఇంకా డిసైడ్ చేసుకోక ముందే ధోనీ ఇలా అంపైర్ను రీవ్యూ కోరడం ఆశ్చర్యపరచింది. అయితే ఆ తర్వాత కోహ్లి కూడా రీవ్యూ కోరడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ను రీవ్యూ కోరాడు. రీవ్యూలో మోర్గాన్ ఔటైనట్లు తేలడం విశేషం. ఇంత ఆశ్చర్యం ఎందుకంటే వన్డే మ్యాచ్, టీ20 మ్యాచ్ సిరీస్ కెప్టెన్సీ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇలా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా ఏళ్ల తర్వాత టీమ్లో ఓ సాధారణ ప్లేయర్గా ధోనీ బరిలోకి దిగాడు. దీంతో అతను ఫీల్డ్లో ఎలా వ్యవహరిస్తాడు? కోహ్లితో ఎలా ఉంటాడు? అతనికేమైనా సలహాలు, సూచనలు ఇస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూశారు. అందరూ అనుకున్నట్లే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా మిస్టర్ కూల్ మాత్రం పుణెలో యాక్టివ్ రోల్ పోషించాడు. కోహ్లి కూడా తరచూ ధోనీని సలహాలు అడగడం కనిపించింది.