అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు పాలన

 

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన చెట్టు-నీరు కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దొచ్చని అన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని అన్నారు.