లంచం ఇవ్వబోయిన కేజ్రీవాల్ కూతురు

 

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూతురు ఓ ప్రభుత్వాధికారికి లంచం ఇవ్వబోయింది. అసలు అవినీతిని అంతం చేయాలి అనే కేజ్రీవాల్ కూతురే లంచం ఇవ్వడమేంటి అని ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ విషయాన్ని స్వయంగా కేజ్రీవాల్ గారే చెప్పారు. అదేంటో చూద్దాం.. కేజ్రీవాల్ ఆటో డ్రైవర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో లంచగొండితనం 80 శాతం వరకు తగ్గిందని అన్నారు. దానికి ఒక ఉదాహరణ కుడా చెప్పారు. కేజ్రీవాల్ కూతురు లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కార్యలయంకి వెళ్లింది. అయితే అక్కడ తన వంతు వచ్చే వరకు ఎదురు చూసింది. అధికారి దగ్గరికి వెళ్లి కావాలనే ఒక ముఖ్యమైన సర్టిఫికేట్ తీసుకురాలేదని చెప్పడంతో అధికారి లైసెన్స్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆమె అతనికి లంచం ఇస్తానని చెప్పిందట. కానీ ఆప్రభుత్వాధికారి దానిని తిరస్కరించి లైసెన్స్ ఇవ్వలేదట. తరువాత ఆమె మళ్లీ వెనక్కి వచ్చి సర్టిఫికెట్ ఇవ్వగా అందులో కేజ్రీవాల్ పేరు చూసి తన పని పూర్తి చేసి పంపారట.