ప్రతిపక్షాలపై కేసీఆర్ మైండ్ గేమ్... వ్యూహంలో చిక్కుకున్న ప్రతిపక్ష నేతలు!!

 

ప్రతిపక్షాలు కేసీఆర్ ట్రాప్ లో పడ్డాయానే వార్త ఈ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఆర్టీసీ సమ్మెను పరిశీలించన కొందరు నేతలు ఈ ప్రశ్న సంధిస్తున్నారు. కేసీఆర్ ట్రాప్ లో ప్రతిపక్షాల పడ్డాయనేది వీరి అనుమానం. దానికి ఉదాహరణగా చ ఆర్టీసీ సమ్మెను చూపిస్తున్నారు. రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా పథకాలు ప్రవేశపెట్టలేదు. పాత స్కీములు కూడా పూర్తిగా అమలు కావడం లేదు. ఆర్థిక మాంద్యం దెబ్బకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగ జారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. యాభై ఏళ్లకే పెన్షన్, కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి వాటికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రైతుబంధు కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందడం లేదు. ఐదు ఎకరాలు దాటిన రైతులకు చాలా మందికి ఇప్పటి వరకు అకౌంట్ లో డబ్బులు పడలేదు. ఇలా చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలాంటి సమస్యల పై పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలను సక్సెస్ ఫుల్ గా ఆర్టీసీ బస్ ఎక్కించారు కేసీఆర్. దాదాపు గా యాభై రోజులుగా ప్రతిపక్షాలన్నీ ఆర్టీసీ చుట్టే తిరుగుతున్నాయి. మరి కొన్ని రోజులు కూడా ఆర్టీసీ వివాదం చుట్టే ప్రతిపక్షాల తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆర్టీసీ వివాదం చుట్టూ ప్రతిపక్షాలను పంపించి కేసీఆర్ వ్యూహం అమలు చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

రెడీమేడ్ గా వచ్చిన సమ్మెతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రతి పక్షాలు భావించి.. అసలు సమస్యలు వదిలేస్తున్నారని కొంత మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలతో పాటు జనం కూడా ఒకే సమస్య పై ఫోకస్ పెట్టేలా సీఎం చూశారని అందులో సక్సెస్ అయ్యారని అంటున్నారు. రేపో మాపో సమ్మె ముగుస్తుంది.. ఆ తరువాత అందరూ ఆ సమస్య మరిచిపోతారని విశ్లేషిస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల టైంలో ప్రతిపక్షాలు రెండు నెలల పాటు ఏ సమస్య వైపు దృష్టి పెట్టకుండా కేసీఆర్ చూశారని.. ఈ విషయాన్ని పసిగట్టలేకపోవటం వల్ల ఫెయిల్యూర్ గా కొంత మంది నేతలు చెబుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల టైంలో కూడా సీపీఐ తో పొత్తు అంటూ అటు కమ్యునిస్టు పార్టీలను కూడా కన్ఫ్యూస్ చేశారు కేసీఆర్. మొత్తానికి సక్సెస్ ఫుల్ గా ప్రతి పక్ష పార్టీలు అన్నింటిని ఆర్టీసీ బస్సు ఎక్కించి తిప్పుతూ అసలు సమస్యల జోలికి రాకుండా దారి మళ్లిస్తున్నారు. మరి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తాయో చూడాలి.