ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌.!!

 

అసెంబ్లీని రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేసి ఆ ప్రతిని గవర్నర్‌ నరసింహన్‌కు అందజేసిన విషయం తెలిసిందే.. తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.. ఈ మేరకు రాజ్‌భవన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్‌ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్‌ వర్గాలు పంపాయి.. దీంతో తెరాస ప్రభుత్వం అధికారికంగా రద్దయింది.. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరారు.. ఇందుకు కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, మంత్రులు కొనసాగాలని సీఎస్‌ ఎస్కే జోషి జీవోను జారీ చేశారు.