జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు విత్‌డ్రాపై కేంద్రం ఆంక్షలు

జన్‌ధన్‌ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు ఈ ఆంక్షలు పెట్టింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీగా గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు. ఖాతా చివరన 0 లేక 1 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 3న నగదు ఉపంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. అలాగే, ఖాతా చివరన 2 లేదా 3 అంకె ఉన్నవాళ్లయితే ఈ నెల 4న , ఖాతా చివరన 4 లేక 5 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 7న,   అలాగే, ఖాతా చివరన 6లేక 7 సంఖ్య ఉన్నవాళ్లయితే ఈ నెల 8న ,ఎనిమిది లేదా 9 అంకె ఉన్నవాళ్లు అయితే ఈ నెల 9న నగదును ఉపసంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు.

ఈ నెల 9 లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తర్వాతైనా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.  కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ ఖాతాల్లో 3 నెలల పాటు రూ.500 చొప్పున  జమచేస్తున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో జన్‌ధన్‌ఖాతాదారుల సంఖ్య 1,18,55,366 ఉండగా, తెలంగాణలో 52,23,218 మంది ఖాతాదారులు ఉన్నారు.