జగన్ వేసిన జోక్.. ట్విట్టర్ లో ట్రెండ్..!!

రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా ఓ సంచలనమే.. ఒక్కోసారి వాళ్ళు సీరియస్ గా మాట్లాడినా కూడా ప్రజలు దాన్ని కామెడీగా తీసుకొని జోకులేసుకుంటూ ఉంటారు.. సరిగ్గా ఇలానే వైసీపీ అధినేత జగన్ విషయంలో జరిగింది.

 

 

రీసెంట్ గా జగన్ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ ఇంటర్వ్యూ లో జగన్ మాట్లాడుతూ.. దేవుడు ఆశీర్వదిస్తే తాను 2019లో ముఖ్యమంత్రిని అవుతానని, తాను అధికారంలోకి వస్తే అసలు అవినీతి అనేదే లేకుండా చేస్తానని అన్నారు.. ఇంకేముంది 'జగన్ క్రాక్స్ ఏ జోక్' అనే హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు జగన్ మీద ఛలోక్తులు విసురుతున్నారు.. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకున్నట్టు, జగన్ చుట్టూ అవినీతి ఆరోపణలు పెట్టుకొని అవినీతి లేకుండా చేస్తా అనడం కామెడీగా ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.. మొత్తానికి జగన్ సీరియస్ గా చెప్పిన మాట కాస్తా జోక్ లాగా మారిపోయి 'జగన్ క్రాక్స్ ఏ జోక్' పేరుతో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.