256 వద్ద ముగిసిన ఆసిస్ తొలి రోజు ఆట

ఆస్ట్రేలియాతో పుణేలో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ పడిన దగ్గరి నుంచి ఆసీస్ పతనం ప్రారంభమైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, హ్యాండ్స్ కొంబ్ కాసేపు ఎదురుదాడికి దిగినప్పటికి భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ స్టార్క్ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో ఆసిస్ అలౌట్ రేపటికి వాయిదా పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.