కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్యకు కరోనా

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు కరోనా పాజిటివ్‌ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానన్నారు. ఇటీవల తనను కలిసిన వారు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారినపడ్డారు. వరుసగా రాష్ట్ర ప్రముఖ నాయకులు కరోనా బారిన పడుతుండటంతో.. మిగతా నేతలు, సన్నిహితుల్లో ఆందోళన నెలకొంది. 

కాగా, ఇప్పటి వరకు కర్ణాటకలో 1,39,571 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం 74,469 యాక్టివ్‌ కేసులున్నాయి.