వాళ్ళందరూ ఢిల్లీ వెళ్లి వచ్చినవారే: కరోనా పై ఏపీ అధికారులు 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన 266 కేసుల్లో 243 ఢిల్లీకి వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ –19పై ఈ రోజు సీఎం  వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష లో  మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయన్న అధికారులు. దీని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామన్న అధికారులు. మరీ పరీక్షలు నిర్వహించేలా టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామన్న  అధికారులు. 

రెడ్‌జోన్ల వారీగా క్లస్టర్లు విభజించి అక్కడ కూడా ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్న అధికారులు. సరిపడా టెస్టు కిట్లు తెప్పించుకోవాలని సీఎం ఆదేశం. క్వారంటైన్లు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో సదుపాయాలకు ఎలాంటి లోటు రాకూడదని సీఎం స్పష్టం చేశారు. ఐసీయూ బెడ్లకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలన్న సీఎం కరోనా విపత్తు వల్ల చీనీ, బత్తాయి, అరటి, టమోటా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశం.  ఈ విషయంలో ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో, ఇతరత్రా రూపంలో నూటికి నూరుపాళ్లు సహకారం అందిస్తానని అధికారులకు స్పష్టం చేసిన సీఎం. 1092కు వచ్చే కాల్స్‌ పరిష్కారంపై దృషి పెట్టాలని, సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించిన సీఎం జగన్.