మెట్రో పిల్లర్ ను ఢీకొన్న కారు... సీఐకు తీవ్ర గాయాలు..


ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ జుబ్లీహీల్స్ లో మెట్రో పిల్లర్ ను ఢికొట్టి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఘటన ఇంకా మరువక ముందు ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈసారి ఏకంగా ఓ సీఐ వాహనమే పిల్లర్ ను ఢీకొట్టింది. వివరాల ప్రకారం... సీఐ వెంకటేశ్వర్లు ఎల్బీ నగర్ నుంచి కొత్తపేటకు వస్తుండగా.. కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న సీఐ వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని... సీఐను దగ్గర్లో ఉన్న ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు.