తెలంగాణఫై చంద్రబాబు లేఖ అపర చాణక్యం

CHANDRA BABU NAIDU LETTER, TDP STAND ON TELANGANA, TDP READY FOR TELANGANA, CHANDRABABU TOUR,  CONGRESS LOLLI, YSR CONGRESS CHARM, JAGAN, KCR, TELUGU DESAM PARTY

చంద్రబాబు అపర చాణక్యాన్ని ప్రదర్శించారు. కర్రా విరగకుండా పామూ చావకుండా ఉండే మార్గాన్ని తెలంగాణ విషయంలో అవలంబించారు. ప్రస్తుతానికి అసలు తమ వైఖరేంటో చెప్పకపోయినా నెపాన్ని కాంగ్రెస్ మీదికి నెట్టిపారేసి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల ఆయనకు రెండు లాభాలు. ఒకటి తెలంగాణ కోసం లేఖ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్న తెలుగుదేశంలోని తెలంగాణావాదుల్ని సంతృప్తి పరచడం మొదటిదైతే, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా ఉండడంవల్ల సీమాంధ్ర ప్రాంతం నేతల అభిమానాన్ని కూడా చూరగొనడం రెండో లాభం. రేపటికి రాజెవడో రెడ్డవడో..? అయ్యేది కాకమానదు. జగబోయేదాన్ని ఎలాగూ అపలేం.. కానీ మన చేతుల్లో ఉన్న ప్రజాభిమానాన్ని మాత్రం పోగొట్టుకోకూడదన్న సత్యం చంద్రబాబుకి ఇప్పటికి స్పష్టంగా బోధపడినట్టుగా అనిపిస్తోంది. అటు సీమాంధ్ర నేతలకూ, ఇటు తెలంగాణ నేతలకూ పార్టీలో సమ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల రేపన్న రోజు ఏం జరిగినా ఇద్దరి మద్దతూ తనకుంటుందన్న ధోరణిలో చంద్రబాబు శరవేగంతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా పాదయాత్ర చేపట్టిన నేపధ్యంలో బాబు లేఖ ఓ రకంగా తెలంగాణ ప్రాంతంలో పర్యటించడానికి వీఐపీ పాస్ లా పనికొస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా. కేసీఆర్ లాంటివాళ్లో, లేక ఆవేశం చల్లారక ఎగిరెగిరిపడే కొందరు తెలంగాణ నేతలో విమర్శలు గుప్పించినంత మాత్రాన లేఖ విషయంలోగానీ, మరే ఇతర విషయాల్లోగానీ చంద్రబాబుకి వచ్చిన నష్టమేమీ లేదు. పైగా “గోపి” ధోరణివల్ల లాభాలే తప్ప అణువంతైనా నష్టం లేదుగాకు లేదు. కేవలం చంద్రబాబు వల్లే తెలంగాణ వెనక్కి పోయిందని ఆరోపిస్తున్న కేసీఆర్ మాటల్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. కాంగ్రెస్ గోల కాంగ్రెస్ దే. ఎటొచ్చీ వచ్చే ఎన్నికల్లో ఎలా ఓట్లు రాబట్టుకోవాలా అన్న అంశంమీదే ఇప్పుడు బాబు పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. పిల్లిపోరు పిల్లిపోరు పిట్ట తీర్చిందన్న సామెతను నిజంచేస్తూ కాంగ్రెస్, వైకాపాల మధ్య రగులుతున్న ( అంతా పైపైకేలా అనే వాళ్లూ కొందరున్నారు) చిచ్చుని తెలుగుదేశం ఓటుబ్యాంక్ కిందకి మార్చుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయం. చూద్దాం.. ఏం జరుగుతుందో..