పడవ బోల్తా.. 400 మంది మృతి

 

యూరప్ లిబియా సముద్రంలో ఘోర ప్రమదం జరిగింది. లిబియా తీరంలో అక్రమంగా తరలిస్తున్న వలసవాదులు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 400 మంది జలసమాధయ్యారు. సమాచారం అందిన వెంటనే ఇటలీ కోస్టగార్డ్‌ బృందాలు రంగంలోకి దిగి సుమారు 144 మందిని ప్రాణాలతో కాపాడారు. మరో తొమ్మిది మంది మృతదేహాలను బయటకు తీశారు. మధ్యదరా సముద్రంలో వాతావరంలో మార్పు వల్ల ఈ ప్రమాదం జరిగుంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.