ముంబై పీఠం ఎవరిదీ...?

బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు జరిగిన ఓట్ల లెక్కింపులో వెలువడిన ఫలితాలు అనూహ్యంగా మారిపోయాయి. కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లిన శివసేన తుది ఫలితం తేలేనాటికి 84 వద్ద నిలిచిపోగా..మొదట బాగా వెనుకబడిన బీజేపీ చివరి నిమిషంలో పుంజుకుని 81 స్థానాలను కైవసం చేసుకుని తన సత్తా చాటింది. దీంతో ముంబై మేయర్ కుర్చీపై ఏ పార్టీ కూర్చుంటుందోనని నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి అవసరమైన మెజారిటీ రాకపోవడంతో 31 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ మద్ధతు కీలకం కానుంది.