జియో ఎఫెక్ట్: టెలినార్ను కొనుగోలు చేస్తోన్న ఎయిర్టెల్
posted on Feb 23, 2017 1:47PM
భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో ప్రకంపనలు సృష్టిస్తోంది. జియో దెబ్బకు టెలికాం దిగ్గజాలన్నీ డైలమాలో పడిపోయాయి. ఖాతాదారులు చేజారకుండా టారీఫ్ ధరలు ఎంతగా తగ్గించినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. దీంతో దేశ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ పెద్ద స్కెచ్చే గీసింది. ఇప్పటికే 269.40 మిలియన్ సబ్స్కైబర్లు ఉన్న ఎయిర్టెల్..యూనిటెక్ నుంచి విడిపోయిన టెలినార్ ఇండియాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ వల్ల ఎయిర్టెల్ 52.5 మిలియన్ యూజర్లను పొందనుంది. మార్కెట్లో రిలయన్స్ జియో నుంచి వస్తోన్న పోటీ నేపథ్యంలో తమ మార్కెట్ను మరింత విస్తరించుకోవడంలో భాగంగా తాము టెలినార్ను కొనుగోలు చేస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. కాగా, ఈ డీల్ విలువ ఎంత అన్నది తెలియరాలేదు.