సైనాకు మళ్లీ నంబర్ 1 స్థానం

 

సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి నెంబర్ వన్ ర్యాంక్ సాధించిందని తెలుసు. అయితే ఆ తరువాత జరిగిన మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్లో ఓడిపోయి ఓ స్థానం కోల్పోయి రెండో ర్యాంక్కు చేరింది. మళ్లీ ఇప్పుడు సైనా నెహ్వాల్‌ తన ర్యాంకును మెరుగుపరుచుకొంది. చైనా షట్లర్ లీ జ్యురుయ్ మీద విజయం సాధించి అగ్రస్థానం సాధించింది. లీ జ్యురుయ్ రెండో స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్కు దిగజారింది. మహిళల ర్యాంకింగ్స్ జాబితాలో పీవీ సింధు 12వ స్థానంలో, పురుషుల జాబితాలో శ్రీకాంత్ 4వ, కశ్యప్ 14వ స్థానాల్లో ఉన్నారు.