విద్యార్థులపై భారం మోపుతున్న ఆర్టీసీ

APSRTC to hike Students Buspass Fares, Government Agreed For Hike, Students Buss Pass Fares Hiked by APSRTC

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) విద్యార్థులపై భారం మోపడానికి సిద్ధపడింది. ప్రస్తుతం వున్న నగరాలలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు రూ.85 నుండి రూ.130, గ్రామీణ ప్రాంతాల్లో 85 నుండి రూ.170 అలాగే రూట్ జనరల్ బస్ పాస్ ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి పంపగా రవాణాశాఖ మంత్రి, అధికారులు సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ ఉత్తర్వులు ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. 1994 లో బస్ పాస్ ధరలను పెంచిన తరువాత ఇప్పటివరకు పెంచలేదు. దీంతో రాయితీలతో కూడిన బస్ పాస్ వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోందని కాబట్టి విద్యార్థుల బస్ పాస్ లపై ధరలు పెంచవలసిన అవసరం ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు.