ఆప్ పార్టీలో మొదలైన రాజీనామాల పర్వం...
posted on Apr 27, 2017 12:59PM
ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆప్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో అప్పుడే ఈ ఎఫెక్ట్ పార్టీ పైన పడినట్టు కనిపిస్తోంది. అప్పుడే ఆ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. నిన్న ఆప్ ఎమ్మెల్యే అల్కాలంబా రాజీనామా చేస్తున్నట్లు చెప్పగా.. తాజాగా మరో ఇద్దరు ఇదే బాటలో వెళ్లారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. పార్టీక కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు సంజయ్ తెలిపారు. ఆయనతో పాటు పంజాబ్ ఆప్ కో అబ్జర్వర్ దుర్గేశ్ పతక్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు.