స్పాట్ ఫిక్సింగ్ లో శిల్పాశెట్టి భర్త
posted on Jun 7, 2013 12:40PM
ఐపీఎల్ క్రికెట్ టీమ్ ఓనర్ల అసలు రూపాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బడాబాబుల పేర్లు..ఇప్పుడు బయటకు వస్తున్నాయి. శ్రీశాంత్ రూపంలో ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని కూపీ లాగిన పోలీసులు ఇప్పుడు పెద్ద తలలనే బయటకు తీస్తున్నారు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ అల్లుడు స్పాట్ ఫిక్సింగ్ లో భాగస్వామి అని తేలితే ఇప్పుడు రాజస్థాని టీమ్ ఓనర్లలో ఒకరైన రాజ్ కుంద్రా కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యాడని తేలింది.
రాజ్ కుంద్రాకు బెట్టింగ్ ముఠాతో సంబంధం ఉందని పోలీసులు నిర్ధారించారు. బెట్టింగ్ వ్యవహారంలో విచారిస్తున్న ముంబై పోలీసులకు అసలు విషయాన్ని రాజ్కుంద్రా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన సొంత జట్టు రాజస్థాన్ రాయల్స్పైనే బెట్టింగ్లు నిర్వహించినట్లు పోలీసులు విచారణలో చెప్పారు. శిల్పాశెట్టి కూడా బెట్టింగ్ లకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పాత్రపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టైన వారికి బెయిల్ దొరకకుండా వారిపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాన్ని పెడుతున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. బెయిల్ ను అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకు ఎ మాత్రం లేదని, నేరం తీవ్రతను బట్టే (మెకా) వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.